కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఓ ఏనుగు భీభత్సం సృష్టిస్తోంది. బియ్యం, గోధుమలు, పంచధార కోసం రేషన్ షాపులపై దాడులు చేస్తోంది. అరికొంబన్ అనే ఏనుగు భీభత్సం సృష్టిస్తోందని సంథన్ పార వాసులు వాపోతున్నారు. గత ఏడాదిన్నర కాలంలో 10 సార్లు రేషన్ షాపులపై దాడి చేసిందని తెలిపారు. 60 ఇండ్లను ధ్వంసం చేసిందని, దాదాపు 10 మందిని చంపినట్లు పేర్కొన్నారు. ఆ ఏనుగును ఇక్కడినుంచి తరలించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.