రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనకు ప్రజలు అంతం పాడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరం దిగువీధిలో ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంతలా మారారని ఆరోపించారు. అధిక ధరల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు లెంక చిన్నంనాయుడు, లెంక సత్యనారాయణ, మిత్తిరెడ్డి వెంకటరమణ, కర్రి ఆదినారాయణ, గోపి తదితరులు పాల్గొన్నారు.