ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరాచక పాలనకు అంతం పాడాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 23, 2023, 11:42 AM

రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనకు ప్రజలు అంతం పాడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరం దిగువీధిలో ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంతలా మారారని ఆరోపించారు. అధిక ధరల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు లెంక చిన్నంనాయుడు, లెంక సత్యనారాయణ, మిత్తిరెడ్డి వెంకటరమణ, కర్రి ఆదినారాయణ, గోపి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com