ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోటో షుట్ దూలతీరింది...గర్జించిన గజేంద్రుడు

national |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 12:13 AM

ఇటీవల కాలంలో వింత పోకడ మొదలైన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు ఫోటో షూట్ పేరుతో కొత్త ట్రెండ్ కొనసాతున్న విషయం తెలిసిందే. కొత్త పెళ్లి జంటకు చేదు అనుభవం ఎదురైంది. వెడ్డింగ్ షూట్‌లో ఏనుగు ఇచ్చిన స్ట్రోక్‌‌కి అందరూ భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ఘటన కేరళలో జరిగింది. గురువాయూర్‌లో ఈ నెల పదో తేదీన ఆలయంలోని ఏనుగుతో ఓ కొత్త జంట వెడ్డింగ్ ఫొటో షూట్ చేసింది. ఇందులో భాగంగా ఏనుగు దగ్గర నించుని దంపతులు ఫోటోలు తీయించుకుంటున్నారు. ఇంతలో ఏం జరిగిందో... ఏనుగులో కోపంతో రెచ్చిపోయింది. ఏనుగు బీభత్సం సృష్టించింది.


ఏనుగు దాడికి పాల్పడింది. దీంతో అక్కడున్న వారంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు. అప్పటి వరకు బాగానే ఉన్న ఏనుగు ఒక్కసారిగా రంకెలు వేసింది. మావటి (ఏనుగును నియంత్రించే వ్యక్తి)పై తొండంతో దాడి చేసింది. ఎత్తి కింద పడేసింది. దాంతో మావటి దుస్తులు ఊడిపోయాయి. అతడు ఏనుగు దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు.


ఈ అనుకోని పరిణామంతో ఆ పరిసరాల్లో ఉన్నవారంతా బిత్తరపోయారు. భయంతో పరుగులు తీశారు. ఫొటో షూట్ తీయించుకుంటున్న దంపతులు, వారి బంధువులు కూడా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇక ఆ వరుడు, వధువులకు అక్కడేం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో పడ్డారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com