ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లిలో అలా చేసి నలుగురికి ఆదర్శంగా నిలిచాడు

national |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 12:14 AM

కొందరు ఉన్నత ఉద్యోగాలు పొంది గౌరవం పొందితే మరికొందరు తమ చర్యలతో నలుగురితో ప్రశంసలు పొందుతుంటారు. ఇదే తరహాలో ఓ పెళ్లి కొడుకు తన చర్యలతో ఎందరిచేతనో ప్రశంసలు పొందాడు. మన దేశంలో వరకట్న సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వరకట్నం తీసుకోవడం చట్ట రీత్యా నేరమే అయినా.. సంప్రదాయాల పేరుతో సాగుతూనే ఉంది. ఈ కట్నం కోసం కొంతమంది మగవాళ్లు... భార్యలను, అత్తమామలను వేధిస్తుంటారు. ఈ వేధింపులు తాళలేక అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఓ వ్యక్తి మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించాడు. అందరితో ప్రశంసలు పొందుతున్నాడు.


ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ వరుడు... తనకిచ్చిన కట్నాన్ని వద్దని తిరిగి అత్తమామల చేతుల్లోనే పెట్టేశాడు. దీంతో వధువు తల్లిదండ్రులు ఆనందంతో పరవశించిపోయారు. లఖన్ అనే గ్రామంలో సౌరభ్ చౌహాన్ అనే రెవెన్యూ అధికారికి... విశ్రాంత ఆర్మీ జవాన్ కూతురైన ప్రిన్స్‌కు పెళ్లి జరిగింది.


అయితే ఆచార, సంప్రదాయాల్లో భాగంగా అతడికి రూ.11 లక్షల రూపాయల నగదు, కొన్ని ఆభరణాలను వరుడికి అందజేశారు. అయితే అతడు మాత్రం ఆ డబ్బనంతా వధువు తల్లిదండ్రులకే ఇచ్చేశాడు. కేవలం ఒక రూపాయి మాత్రం తీసుకున్నాడు. దీంతో అత్తమామలు.. అల్లుడిని చూసి గర్వపడ్డారు. గ్రామప్రజలు సైతం అతడిని ప్రశంసలతో ముంచెత్తారు. సౌరభ్ ఎంతోమంది ఆదర్శంగా నిలిచాడని అభిప్రాయపడ్డారు.


ఇదిలావుంటే ఆ పెళ్లి కొడుకు అంత గొప్పగా చూడ్డానికి కారణాలు లేకపోలేదు. మన దేశంలో వరకట్నం కోసం కోడళ్లను తగలబెట్టిన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఎక్కడో చోట వరకట్నం చావులు నమోదవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన చట్టం ఉన్నా.. ప్రయోజనం శూన్యం. ఆచారాలు, సంప్రదాయాల పేరుతో కట్నం ఇచ్చే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. కట్నం ఇవ్వలేక ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు.. ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com