ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాగిన మత్తులో పిల్లలపైకి కారు తోలిన డ్రైవర్...ఓ చిన్నారి మరణం

national |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 12:24 AM

మద్యం మత్తులో డ్రైవింగ్ తన ప్రాణాలకు కాదు ఎదుటివారి ప్రాణాలను సైతం హరిస్తాయి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేుకొంది. ఆ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలి అయింది. పానీపూరి తినడానికి బయటకు వచ్చిన పిల్లలు... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మద్య మత్తులో కారు డ్రైవింగ్ చేయడంతో... పిల్లలపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి ప్రాణం కోల్పోయింది. నోయిడాలోని సెక్టార్ 45 సదాపూర్‌లో రియా, అను, అంకిత అనే ముగ్గురు అక్కచెల్లెల్లు పానీపూరి తినడానికి బయటకొచ్చారు.


ముగ్గురు సరదాగా రోడ్డు పక్కన ఉన్న ఓ బండి దగ్గర పానీపూరి తింటున్నారు. అదే సమయంలో ఓ కారు అటువైపుగా వచ్చింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి పానీపూరీ తింటున్న ముగ్గురు చిన్నారులపైకి వెళ్లింది. దాంతో ముగ్గురు అక్కచెల్లెల్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే అక్కడున్న జనం వెంటనే ఆ పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చాలా గాయాలతో రక్తసిక్తంగా మారిపోయారు.


ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులకు వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లిన చిన్నారుల్లో రియా (6) అనే చిన్నారి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com