ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిమ్స్ కు వెళ్లే వారికి శుభవార్త తెలిపిన మంత్రి రజని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 09:46 AM

మంగళగిరి నగరంలోని ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లే వారికి రాష్ట్ర వైధ్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో లేక పోవడంతో దీర్ఘకాలిక వ్యాధులపై చికిత్సల కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ మేరకు సోమవారం మంగళగిరి ఎయిమ్స్ ను సందర్శించిన మంత్రి విడదల రజని ఆసుపత్రిని పరిశీలించారు. అలానే ఇక్కడ జరుగుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ మేరకు రానున్న రెండు రోజుల్లో ఆరోగ్య శ్రీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అలానే త్రాగునీటి సమస్యకు త్వరలోనే శ్వాశత పరిష్కారం చూపుతామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com