ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా స్వామివారికి ఊంజల్ సేవ

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 09:42 AM

కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ప్రధాన ఆలయం నందు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం రాత్రి సిద్ధి బుద్ధి సమేత శ్రీ కాణిపాక వినాయక స్వామి వారికి దేవస్థానం అర్చకులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఊంజల్ సేవ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి బుద్ధి సమేత స్వామి వారి ఉత్సవమూర్తులకు వివిధ సుగంధ ద్రవ్యాలతోఅభిషేకించి, సహస్రనామార్చనాలతో నైవేద్యం సమర్పించి, పరిమళభరిత పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉభయ దారులుగా కాణిపాకం సల్లా వాసు వ్యవహరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com