ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నానమ్మ అంత్యక్రియల కోసం సామాగ్రి తెస్తూ మనవడు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 06, 2022, 10:18 AM

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. నానమ్మ యల్లమ్మ చనిపోయిందని ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు విడపనకల్లు నుండి ఆటోలో సామాగ్రిని తీసుకొస్తుండగా మాళాపురం వద్ద శనివారం ఆటో బోల్తా పడిన ఘటనలో మనవుడు వంశీ (19) మృతిచెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లి గ్రామంలో యల్లమ్మ మహిళ చనిపోయింది. మనవడు వంశీ మరో నలుగురు అంత్యక్రియలు నిర్వహించేందుకు సామాగ్రిని విడపనకల్లు నుంచి పెద్ద కొట్టాలపల్లికి ఆటోలో తీసుకోస్తుండగా మాళాపురం వద్ద ఆటో బోల్తా పడి మనవడు వంశీ (19)మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పెద్ద కొట్టాలపల్లి గ్రామంలో ఒకసారిగా అవ్వ, మనవడు మృతి చెందడంతో మృతుల బంధువులలో తీవ్ర విషాదం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com