గుంటూరులో భార్య జగదీశ్వరిపై అనుమానంతో గొడవ పడి ఆమె తలపై డంబుల్తో మోదాడు శ్రీనివాసరావు అనే వ్యక్తి. దీంతో ఆమె రక్తపు మడుగులో చలనం లేకుండా పడిపోయి ఉంది. ఆమె చనిపోందని భావించి అతడు పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. అయితే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా ఆమె ఊపిరితో ఉండటాన్ని గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.