ఉత్తరాంధ్రకు ద్రోహం చేసి ఇంకెంత కాలం చంద్రబాబుకు ఊడిగం చేస్తారని ఆ ప్రాంత టీడీపీ నేతలను వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. గత రెండు రోజులుగా సేవ్ విశాఖ అంటూ టీడీపీ పదిమందిని పోగేసి, ఒక హైడ్రామాను నడిపిస్తుంది. విశాఖను పరిపాలనా రాజధానిగా వద్దనే ఉత్తరాంధ్ర ద్రోహులు, విశాఖ ద్రోహులైన మీరు.. విశాఖను సేవ్ చేస్తారా.. అది ప్రజలు నమ్మాలా..? అని నిలదీశారు. టీడీపీ మాటలు, చేష్టలు చూస్తే... అదొక తెలుగు డ్రామాల పార్టీగా తయారైంది. విశాఖ పరిపాలన రాజధాని కావడం ఇష్టం లేక, విశాఖ నగరానికి ఏదోఅయిపోతుందని, కబ్జాలు జరుగుతున్నాయని, గంజాయి మాఫియా తయారవుతుందని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి విశాఖలో భూకబ్జాలు జరిగిందీ, గంజాయి మాఫియా తయారైందీ.. చంద్రబాబు హయాంలోనే, వారి ప్రభుత్వం అండదండలతోనే. మరోవైపు, వచ్చే నెల 11, 12 తేదీల్లో ముఖ్యమంత్రి జగన్ గారితో కలిసి విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీగారు వస్తున్న నేపథ్యంలో.. విశాఖ బ్రాండ్ ఇమేజ్ తగ్గించేందుకు టీడీపీ ఇటువంటి డ్రామాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. శనివారం వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడారు.