రాజధాని భూమి ప్రజలకు ఇవ్వకూడదా? రియల్ ఎస్టేట్ చెస్తారా..? అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, ప్రజల తరుపున ఎవరు నిలబడ్డారో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసి ప్రయాణం సుఖం , సురక్షితం అన్నారు.. ఆర్టీసీ బస్సులను వాడుకొనపొవడమే ప్రమాదాలకు కారణం అన్నాఉ.. ఒక్కో ఆటోలో పది, 12 మంది ప్రయాణిస్తున్నారు.. ఈ విషయం ప్రజల మైండ్ సెట్ మారాలని సూచించారు.. శ్రీకాకుళం ప్రజల అవసరం కోసం 24 బస్సులు అదనంగా ప్రారంభిస్తున్నాం.. ఆర్టీసీ ఉద్యోగులు సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.. 1980లో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మించాం.. దాంతో, నీరు నిలిచిపోతోంది.. దీనికి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.