ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాకు ఓటేయకపోతే పథకాలు కట్: ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 04:54 PM

ఏపీలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే (వైసీపీ) పర్వత పూర్ణచంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శంఖవరం మండలం అన్నవరం వెల్లంపేటలో ఆయన పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాల గురించి ప్రజలకు వివరించిన ఆయన, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలన్నారు. తమకు ఓటేయకుంటే పింఛన్ రాదని వృద్ధురాలిని హెచ్చరించారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com