ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ జైలులో ఒక్కో గదిని రోజుకు రూ.500లు చొప్పున అద్దెకు ఇస్తున్నారు. జాతకం ప్రకారం కొందరికి జైలులో ఉంటారని జ్యోతిష్కులు చెబుతున్నారు. వాటిని ఎక్కువగా నమ్మే కొందరు భక్తుల కోసం జైలు అధికారులు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. జైలులో ఉండాలనుకునే వారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తామని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. దీనికి ఉన్నతాధికారుల అనుమతి రావాల్సి ఉందన్నారు.