ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కబ్జా చెరనుంచి వాణీశ్రీ ల్యాండ్ విడిపించిన తమిళనాడు సర్కార్

national |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 11:44 PM

పాలనపై తనదైన ముద్ర వేస్తున్న తమిళనాడులోని సీఎం స్టాలిన్ భూకబ్జాపై కూడా నజర్ పెట్టింది. అప్పుడెప్పుడో కబ్జాకు గురైన తెలుగు, తమిళ సీనియర్ నటి వాణిశ్రీ భూమి తిరిగి ఆమె సొంతమైంది. దాదాపు రూ. 20 కోట్ల విలువైన ఈ భూమిని కొందరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోగా, దానిని రద్దు చేసిన స్టాలిన్ ప్రభుత్వం నిన్న ఆ భూమిని తిరిగి వాణిశ్రీకి అందించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా భూమి పత్రాలను ఆమెకు అందించారు. మొత్తం ఐదుగురి భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించి వాటిని తిరిగి యజమానులకు అందించారు. అందులో వాణిశ్రీ ఒకరు.


భూమి పత్రాలను తీసుకునేందుకు సచివాలయానికి వచ్చిన వాణిశ్రీ మాట్లాడుతూ.. రూ. 20 కోట్ల విలువైన తన భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేశారన్న విషయం తెలిసి తన ఆస్తి పోయిందనే అనుకున్నానని, ఆశలు వదిలేసుకున్నానని అన్నారు. అయితే, గతేడాది నకిలీ పత్రాల ద్వారా జరిగిన భూ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని తీసుకొచ్చి తన భూమిని తనకు ఇప్పించినందుకు సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను 11 ఏళ్లుగా తిరిగి తిరిగి అలసిపోయానని, ఇకపై పైసా కూడా ఖర్చు పెట్టకూడదని అనుకున్న సమయంలో ముఖ్యమంత్రి కల్పించుకుని తన భూమిని తిరిగి ఇప్పించారని పేర్కొన్నారు. ఆయన చల్లగా ఉండాలని, మంచి పాలన అందిస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com