కామన్వెల్ క్రీడల సమయంలో గాయపడిన భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జాతీయ క్రీడలకు దూరం కానుంది. మడమ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో జాతీయ క్రీడల నుంచి తప్పుకోవాలని సింధు నిర్ణయించింది. ఈనెల 29న జాతీయ క్రీడల ఆరంభ వేడుకల్లో మాత్రం పాల్గొననుంది. గాయం కారణంగా ఈ క్రీడల్లో పాల్గొనడం లేదని.. ఆసియా క్రీడలు, పారిస్ ఒలింపిక్స్ పైనే ప్రస్తుతం తన దృష్టి ఉందని సింధు తెలిపింది.