ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయ నిర్మాణానికి భూమి పూజ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 11:30 AM

మండల కేంద్రమైన వరికుంటపాడు గిరిజన కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం శ్రీవాణి ట్రస్ట్ సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల నూతన ఆలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సింహపురి జోన్ కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ జిల్లాల్లో టిటిడి సహకారంతో ఐదు ఆలయాలు మంజూరు కాగా అందులో ఒకటి వరికుంటపాడు గిరిజన కాలనీకి మంజులైందని తెలిపారు. ఈ కాలనీకి సీతారామచంద్ర గిరిజన కాలనీగా పేరు మార్చుకుంటామని కాలనీ వాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆర్ నాగేంద్ర, వైసీపీ కన్వీనర్ బాల గురువారెడ్డి, సొసైటీ అధ్యక్షులు వెంకటరత్నం, ఆలయ పరిరక్షణ కమిటీ కన్వీనర్ రాజేంద్ర, సభ్యులు రాంబాబు, జగన్నాథం, అంజమ్మ సమరసత సేవ ఫౌండేషన్ సభ్యులు బ్రహ్మయ్య, మోహన్ రావు, పరంధామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com