ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 10:20 PM

నిర్మల్ జిల్లా భైంసా ఎస్సీ బాలుర వసతి గృహం నుంచి నలుగురు విద్యార్థులు అదృశ్యమవడం ఇప్పుడు సర్వత్రా కలకలం సృష్టిస్తోంది. మంగళవారం (అక్టోబర్ 22న) ఉదయం.. చరణ్, రాకేష్, కేశవ్, ఈశ్వర్ అనే నలుగురు విద్యార్థులు అదృశ్యమైనట్టు.. వార్డెన్ గుర్తించాడు. వెంటనే ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించగా.. హాస్టల్ దగ్గరికి చేరుకుని వార్డెన్‌ను నిలదీశారు. దీనిపై పోలీసులు విషయం తెలపగా.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


అయితే.. అంతకుముందు రోజు(అక్టోబర్ 21న) రాత్రి సమయంలో విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. కట్ చేస్తే.. ఉదయం ఆరు గంటల సమయంలో.. నలుగురు విద్యార్థులు గోడ దూకి పారిపోయినట్టుగా వాచ్ మెన్ చెప్తున్నాడు. మరి ఈ నలుగురు విద్యార్థులు ఎక్కడికి పారిపోయారు.. అసలు రాత్రి ఎందుకు గొడవ జరిగింది అనేది తెలియాల్సి ఉంది.


అయితే.. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ హాస్టళ్లు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. విద్యార్థులు అస్వస్థతకు గురవటమో.. లేదా విద్యార్థులు పారిపోవటమో.. లేదా ఆత్మహత్య చేసుకోవటమే లాంటి ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. కాగా.. ఇప్పుడు నలుగురు విద్యార్థులు హాస్టల్ నుంచి కనబడకుండా పోవటం.. విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి సరైన మార్గదర్శనం లేకపోవటం ఒక కారణమైతే.. వసతులు లేకపోవడం, సరైన భోజనం అందించకపోవటం లాంటి కారణాలు కూడా విద్యార్థులు అక్కడ ఉండకుండా చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.


ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లోని వనస్థలిపురం రవీంద్రభారతి రెసిడెన్షియల్ స్కూల్‌లో కూడా ఇద్దరు విద్యార్థుల అదృశ్యమైయ్యారు. విద్యార్థులు అక్టోబర్ 20న రాత్రి హాస్టల్ కిటికీ గ్రిల్స్ తొలగించి మరి పారిపోయినట్లు స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పించుకుపోయిన విద్యార్థులు.. 9వ తరగతి చదువుతున్న జస్వంత్ రెడ్డి, చైతన్యగా పోలీసులకు తెలిపారు. ఈ విషయం సదరు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయగా.. తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com