దుబ్బాక లో గ్రామ సింహాలు విచ్చలవిడిగా స్వైరా విహారం చేస్తు న్నాయి. దారిని పోయే బాటసారులు, మోటార్ సైకిల్పై వెళ్లేవారిపై ఒక్కసారిగా దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ప్రజలు భయాం దోళనకు గురౌతున్నారు.దుబ్బాక లోని స్థానిక బస్టాండ్,ప్రధానమైన కూడళ్లు, వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒంటరిగా వెళ్లే వారిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడుతున్నాయి.
విద్యార్థులను ఒంటరిగా స్కూలుకు పంపాలంటే తల్లీదండ్రులు బయపడాల్సిన పరిస్థితులు నెలకు న్నాయి. కుక్కల వ్వవహారాన్ని ఇప్పటికే పలు దఫాలుగా పుర కమీషనర్ , అధికారులు, దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కుక్కలు, భారీ నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.