ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 04:01 PM

మహబూబాబాద్ జిల్లా, బీసీ సబ్బండ వర్గాల కుల బాంధవులకు  తెలియజేయునది ఏమనగా 23 అక్టోబర్ 2024 బుధవారం రోజున ఉదయం 10:00 గంటలకు, గూడూరు శివాలయం ప్రక్కన గౌడ కమ్యూనిటీ హాల్ నందు, బీసీ రాజ్యాధికారసమితి ఆధ్వర్యంలో చర్చ కార్యక్రమం కలదు. ఇట్టి కార్యక్రమానికి సబ్బండ బిసి కులాలకు సంబంధించిన, వివిధ వర్గాల కుల సంఘ నాయకులు, కులపెద్దలు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, పెద్దఎత్తున హాజరుకావలిసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో తరాతరాలుగా బిసి వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగ, రిసర్వేషన్, కులగణన తదితర అన్ని విషయాలలో జరుగుతున్న నష్టాల గూర్చి, భవిష్యత్తులో మన హక్కుల కోసం చేయాల్సిన పోరాటల కార్యాచరణ సమగ్రచర్చ జరిపిన అనంతరం.
గూడూరు కేంద్రంగా కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని, బిసి బాందవులు అందరు సకాలంలో హాజరయి, కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని, జిల్లా బాద్యులు పెదకాసు కుమార స్వామి, రాష్ట్ర బాద్యులు కట్ల విష్ణు, రాష్ట్ర కార్యదర్శి ముంజాల రాజేందర్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్ లు కోరుకుంటూ తెలియజేసారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com