రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కారు పలు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఒక్కరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏరియా ఆసుపత్రికి తరలించారు. వేములవాడ సిరిసిల్ల ప్రధాన రోడ్డులో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ ప్రశాంత్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.