గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని టీయుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నారాయణపేట డీపీఓ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను గ్రామ పంచాయతీ కార్మికులకు ఇవ్వాలని కోరారు. మల్టిపర్పస్ విధానం రద్దు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ, భీమా సౌకర్యం కల్పించాలని అన్నారు.