ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే మురళి నాయక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2024, 03:34 PM

మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం రోజున ఆకస్మిక తనిఖీ చేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్. అడ్మిట్ అయినా పేషెంట్లను ప్రభుత్వ దవాఖానలోని సౌకర్యాలగురించి అడిగి తెలుసుకున్నారు.  ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలను సకాలంలో సిబ్బంది అందిస్తున్నారా! లేదా? అని వాకబ్ చేశారు.
తాను డాక్టర్ కావడం చేత పేషంట్లను వారి జబ్బుల గురించి అడిగి తెలుసుకున్నారు, వారిని పరీక్షించారు. తగు జాగ్రత్తలను  సూచించారు. తధానంతరం ప్రభుత్వ దహఖానాలోని పరిస్థితుల, స్థితిగతుల గురించి, సూపరింటెండెంట్ వీరన్న నాయక్ ను అడిగి తెలుసుకున్నారు. గూడూరు గిరిజన అతిపెద్ద మండలం కావడం చేత, ప్రజలందరికీ అందుబాటులో ఉండి, ఈ సీజన్ వ్యాధుల సమయంలో రోగుల అందరితో, సేవా దృక్పథంతో మెలగాలని, వైద్యాన్ని అందించాలని సూచించిన, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com