సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండలం పరిధిలో ఎస్ఐ వెంకట్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.