నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నారాయణపేట నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. కరెంటు స్తంభాలను, వైర్లను, విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు. చెరువులు, కుంటలు, జలాశయాల వద్దకు వెళ్లరాదని అన్నారు. పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రావద్దని చెప్పారు.