పింఛన్ల డబ్బును రుణాల కింద జమ చేసుకోవడంపై వల్లూరు క్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కంది మండలం ఇంద్రకరం గ్రామంలో కలెక్టర్ శనివారం పర్యటించారు. పింఛన్లు ఇవ్వడం లేదని పలువురు లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే బ్యాంకుల్లో పిలిపించిన కలెక్టర్ ఇదేం పద్ధతి అంటూ ఆగ్రహించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అందే పింఛన్లు, రుణమాఫీని వెంటనే అందించాలని సూచించారు.