అనంత గిరి మండలం పాలవరం ఎస్సీ కాలనీ లో చ భారీ వరద నీరు చేరింది. వరద నీరు ఇళ్ల వద్ద నిలిచింది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గత మూడు గంటలు గా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వరద పెరిగింది. వరద నీటి తో సీసీ రోడ్డు మునిగి పోయి రహదారి కనిపించడం లేదు. వరద మరింత ఉదృతం అయితే ఇళ్ళు మునిగి పోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.