శనివారం రాత్రి నుండి పడుతున్న భారీ వర్షాలకు నారాయణపేట మండలం సింగారం వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎగువన పడుతున్న వర్షాలకు వాగుకు నీటి ప్రవాహం పెరగడంతో పొంగిపొర్లుతున్నాయి. వాగు దాటే సాహసం చేయరాదని, వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉదృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వాగు ఉదృతి చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నారు. ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.