నెలల తరబడి శానిటైజర్ సమస్యతో బిల్డింగ్ నాలుగు వైపులా సానిటరీ పైపులు లీకుతో గోడల నిండా మలమూత్రాల వ్యర్థం కారుతున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చాలగాటము ఆడుతున్నారని ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ch.శిరోమణి, PYL రాష్ట్ర నాయకులు మందా సురేష్ లు విమర్శించారు.
స్థానిక ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం ముందు పి వై ఎల్ (PYL)ప్రగతిశీల యువజన సంఘం, పి ఓ డబ్ల్యు (POW) ప్రగతిశీల మహిళా సంఘల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ....
ఉమ్మడి ఖమ్మం జిల్లా కు ఆరోగ్య కేంద్రం అయినా ప్రభుత్వ హాస్పిటల్ మరియు మాత శిశు ఆరోగ్య కేంద్రం బిల్డింగ్ నాలుగు వైపులా శానిటరీ పైపులు బ్లాక్ మరియు లీక్ అయి మలమూత్రల వ్యర్థం గోడల నిండా కారుతున్నాయి అని లేబర్ రూమ్ నుండి మొదలుకొని ఆపరేషన్ థియేటర్, 1st ప్లోర్ 2nd ప్లోర్ బాత్రూం లు మొత్తం బ్లాక్ అయి కంపు కొడుతున్నాయి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.