ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మాంగో డిబి తమ కళాశాల యస్.బి.ఐ.టి.ను సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ గా గుర్తించిందని కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ ఒక ప్రకటనలో తెలియచేశారు. శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన సదస్సులో సంస్థ ప్రతినిధుల నుండి సంబందిత పత్రాలను అందుకున్నట్లు వారు తెలిపారు.
ఎక్స్టెన్సీ కేంద్రంగా గుర్తింపు పొందటం ద్వారా తమ కళాశాల విద్యార్థులకు సంస్థచే ఆధునిక కోర్సులను అందించటంతో పాటుగా ఉద్యోగ అవకాశాలకు ప్రముఖ కంపెనీలు విచ్చేసే అవకాసం ఉందని వారు తెలిపారు. తమిళనాడుకు చెందిన ఐ.సి.టి. అకాడమీ వారి సహకారంతో నిర్వహించిన మాంగో డిబి కోర్సులను తమ విద్యార్థులు మెరుగుగా ఉపయోగించుకోవటంతో పాటు అద్భుత ప్రతిభను కనబరచి నందుకు గాను తమ కళాశాలకు ఈ గుర్తింపు దక్కిందని కళాశాల సెక్రటరీ అండ్ కరస్టాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు.