ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 11:16 AM

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ కొమ్ము నేని నారాయణ సేవలు మరువలేనివని జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. నారాయణ కుటుంబాన్ని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత - సురేష్ తో పాటు పలువురు ప్రముఖులు పరామర్శించారు.
కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నారాయణ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని నారాయణ అకాల మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ నారాయణ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మ శాంతించాలని కోరారు. ఈ కార్యక్రమంలోసీనియర్ న్యాయవాది రాచకొండ శ్రీరాములు, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, జగిత్యాల  మున్సిపల్ మాజీ కౌన్సిలర్ లైశెట్టి వెంకట్, తరుణ్, బుగ్గారం మాజీ సర్పంచ్ మసర్తి రాజిరెడ్డి, బుగ్గారం మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి దసర్తి పూర్ణ చందర్, బీర్ పూర్ తిరుపతి, మసర్తి బుచ్చన్న, దండికే తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com