కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇస్సన్నపల్లిలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం మంగళవారం పురస్కరించుకొని స్వామివారికి ఉదయము అభిషేకము మధ్యాహ్నము సింధూర పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు టెంకాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఈవో సిబ్బంది పాల్గొన్నారు.