ఏజెన్సీ ప్రాంతాలలో విస్తృతంగా జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. ఈ విషయమై మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రభుత్వం తరఫున మెడికల్ క్యాంపులు నిర్వహించి మందులు ఇవ్వాలని కోరారు.