మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల రైతులతో కలసి వరి నాట్లు వేశారు. మరో రైతు పొలంలో ట్రాక్టర్ తో దమ్ము చేశారు. అనంతరం రైతులతో కలిసి మాట్లాడుతూ, అందరికీ లక్ష రూపాయల రుణ మాఫీ అయ్యిందా అని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాతో కలసి నాట్లు వేయడం చాలా సంతోషంగా ఉందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే బత్తుల రైతులకు తెలిపారు.