మేడ్చల్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాగారం మున్సిపాలిటీలోని స్టార్ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ ఏవియన్ రెడ్డి విచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి నెరవేర్చని పలు హామీల గురించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.