నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో పేర్కొన్న విధంగా వ్యవసాయ రంగానికి చిత్తశుద్ధితో నిధులు కేటాయించి, ఆచరణలో అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు యంపల్ల పురుషోత్తం రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేస్తే రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు.