తెలంగాణ వాసులకు వాతవరణ శాఖ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో తొలకరి జల్లులు ప్రారంభమగా.. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మరో మూడు రోజుల పాటు.. వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది వాతావరణ కేంద్రం.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడా.. మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది.
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, భువనగిరి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మరోవైపు.. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఇదిలా ఉండగా.. ఆదివారం రోజున హైదరాబాద్లో భారీ వర్షం కురియగా.. మంచిర్యాల, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడ్డాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కాసిపేటలో 6 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.