లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జోగులాంబ గద్వాల జిల్లాలో మద్యం, డబ్బు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఎస్పీ రితిరాజ్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నెలవారి నేరసమీక్ష నిర్వహించారు. మిస్సింగ్, ప్రాపర్టీ, రోడ్డు ప్రమాదాల కేసుల ఫైల్స్ పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు. బార్డర్ చెక్ పోస్టుల వద్ద పటిష్టంగా ఉంచాలని, కేసులు పెండింగ్ లో ఉంచవద్దన్నారు.