వనపర్తి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఏప్రిల్ 18న నాగర్ కర్నూల్ రిటర్నింగ్ అధికారి ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.