వనపర్తి జిల్లా పట్టణంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుంబిగించి సునామీ సృష్టించి ప్రజల హృదయాలను గెలుచుకున్నానని అన్నారు. బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి అర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని ప్రజలను కోరారు.