వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి గల్లంతయిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రాయిగడ్డ కాలనీకి చెందిన బొలెమోని రాములు (42) నల్ల చెరువులో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం కోసం గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.