జోగులాంబ గద్వాల జిల్లా & మండలం మేళ్లచెరువు గ్రామానికి చెందిన పేదింటి బిడ్డ సుధారాణి ఉస్మానియా యూనివర్సిటీలో జంతు శాస్త్ర విభాగంలో పీహెచీ పూర్తి చేసి డాక్టర్ రేట్ పొందారు. దీంతో మంగళవారం గద్వాల టీఎన్జీఓ భవన్ లో అభినందన సభ ఏర్పాటు చేశారు. సభకు విద్యార్థి సంఘాల నేతలు, విద్యాభిమానులు హాజరై ఘనంగా సన్మానించారు. రాబోయే రోజులలో మరిన్ని పరిశోధనలు చేసి నడిగడ్డ కీర్తిని నలుదిశలా వ్యాపింప చేయాలని ఆకాంక్షించారు.