గ్రేటర్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేశారు. రేపు పోలింగ్ డే కావడంతో డబ్బులు తరలింపుపై నిఘా పెంచారు. ప్రధాన రహదారులే కాకుండా అంతర్గత రూట్ లోను రోజంతా జల్లెడ పట్టారు. అటువైపు వచ్చిన ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెడితే వెంటనే సమాచారం ఇవ్వాలని cVIGIl యాప్ లో పిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో యాక్షన్ తీసుకుంటామని అధికారులు సూచిస్తున్నారు.