మరికొన్ని గంటల్లోనే పోలింగ్ జరగనుండటంతో చివరి ప్రయత్నాల్లో పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ప్రధానంగా సైలెంట్ ఓటింగ్పై పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే జాతీయ, రాష్ట్ర నేతలు ఆయా నియోజకవర్గాల్లో సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్షోలు నిర్వహించారు. ఓటర్ల నాడి పట్టడం కష్టంగా మారింది. ముఖ్యంగా సైలెంట్ ఓటింగ్ కీలకంగా మారనుంది. ఇది ఏ పార్టీకి మళ్లితే వారే గెలిచే అవకాశం ఉంటుంది.
నిన్నతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగియడంతో నేతలంతా కదులుతున్నారు. ఇక అందరి దృష్టి పోలింగ్ పైనే కేంద్రీకృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం పోలింగ్ జరగనుంది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓ నియోజకవర్గంలో ఓటు హక్కు లేని నాయకుడు ఆ నియోజకవర్గంలో ఉండకూడదు. దీంతో ఎన్నికల ప్రచారానికి ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జాతీయ పార్టీల నేతలు వెనుదిరిగారు.