ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ రాజకీయ శూన్యతను థర్డ్ ఫ్రంట్ భర్తీ చేస్తుంది....అసదుద్దీన్ ఓవైసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 07:15 PM

ఇండియా కూటమిని తాను అసలు కేర్ చేయనని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర చెప్పారు. వాస్తవానికి దేశంలో రాజకీయ శూన్యత ఉందని... ఆ శూన్యతను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని థర్డ్ ఫ్రంట్ భర్తీ చేస్తుందని భావించానని చెప్పారు. ఈ రాజకీయ శూన్యతను ఇండియా కూటమి భర్తీ చేయలేదని అన్నారు. ఇండియా కూటమిలో కేసీఆర్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలలోని ఎన్నో పార్టీలు భాగస్వాములు కాదని  చెప్పారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గురించి ఒవైసీ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గత నెలలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ నాయకత్వం వహిస్తే థర్డ్ ఫ్రంట్ లోకి జంప్ అయ్యేందుకు ఎన్నో రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com