ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు....అమిత్ షాపై జగదీశ్ రెడ్డి ధ్వజం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 06:50 PM

చరిత్రలోని పాత గాయాలను మళ్లీ రగిలించి, సమాజాన్ని చీల్చే ప్రయత్నం అమిత్ షా చేస్తున్నారని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి  దుయ్యబట్టారు. తెలంగాణ విమోచన దినం పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపోహలను సృష్టిస్తున్నారని ఆయన  మండిపడ్డారు.ఇలాంటి వారు దేశ మనుగడకు ప్రమాదకరమని అన్నారు. అన్నదమ్ముల్లా కలిసున్న తెలంగాణ సమాజంలో చిచ్చుపెడితే సహించబోమని హెచ్చరించారు. కర్ణాటకలో ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎన్ని చెప్పినా ప్రజలు వినే పరిస్థితిలో లేరని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com