దేశంలో ఉచితంగా ఇంటర్ విద్య అందిస్తున్నది తెలంగాణ రాష్ట్ర మేనని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అరబిందో సహకారంతో 5. 50 కోట్లతో నిర్మించిన అదనపు గదులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు మార్కులు రావడం అభినందనీయమని తెలిపారు.