నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ మండలం సమస్తీపూర్ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన కర్ణాటక సరిహద్దు బార్డర్ చెక్ పోస్టును మంగళవారం సిఐ సీతయ్య తనిఖీ చేశారు. కర్ణాటకలో బుధవారం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో డబ్బు మద్యం, ఇతర వస్తువులు అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని అన్నారు. బుధవారం ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.