ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైయస్ఆర్ కాలనీలో ఈ నెల 14న ఆదివారం బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవం జరుగనుంది. కాగా ఈ నేపథ్యంలో ప్రతిష్ఠకు అవసరమైన రూ. 85, 116 ల విలువ చేసే అమ్మవార్ల విగ్రహాలను పొంగులేటి శీనన్న సైన్యం తరపున యూత్ నాయకులు బోడా శ్రావణ్ కుమార్ ఆలయ కమిటి నిర్వాహకులకు మంగళవారం అందజేశారు. భవిష్యత్తులోనూ పొంగులేటి శీనన్న సైన్యం తరపున ఆలయ అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామని శ్రావణ్ కుమార్ తెలిపారు.