చిలిపిచెడ్ మండలం, గౌతాపూర్ గ్రామంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఏఎస్ఐ మిస్బోద్దిన్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, బాల్య వివాహాలు, వరకట్న వేధింపుల పై ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని, అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారం చర్యల తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సతీష్, సాజిద్, సర్పంచ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.