సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని పుల్కుర్తి గ్రామానికి చెందిన చేపల రమేష్ వయసు ౩౭, తండ్రి చేపల అంబోజి రోజూ లాగే చేపలు పట్టడం కోసం పుల్కుర్థి చెరువు వద్దకు వెల్లాడు. చీకటి అవుతున్న రమేశ్ ఇంటికి రాలేదని రమేశ్ భార్య ఫోన్ చేయగా మాటి మాటికి ఫోన్ చేయకు అంటు ఫోన్ కట్ చేశాడు. తర్వాత ఆ రోజంతా ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. భార్య చెరువు వద్దకు వెళ్లి చూడగా ఆచూకీ దొరకలేదు. రమేష్ భార్య మనూర్ పోలీస్ వారిని సంప్రదించారు. వెంటనే మనూర్ పోలీసులు చెరువు వద్ద తనిఖీ చేయగా పుల్కుర్తి రమేశ్ మృత దేహం చెరువు శివారులో కనిపించినట్లు మనూర్ ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు మృత దేహం అప్పగించామని తెలిపారు.